కార్లో తాగి పడుకుని.. ఏసీ ఎక్కువై చనిపోయాడు

కార్లో తాగి పడుకుని.. ఏసీ ఎక్కువై చనిపోయాడు

AC ఆన్ చేసి ఉండగా ఆల్కహాల్ తాగి కారులో పడుకున్న వ్యక్తి అలాగే చనిపోయాడు. మృతుడిని సుందర్ పండిట్‌గా గుర్తించారు. అతని సోదరుడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో ప్రాణాంతకమైన కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా పీల్చుకోవడంతో వెహికల్ క్యాబిన్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు.

బరోలా గ్రామంలో ఉండే సుందర్ పండిట్ కు.. సెక్టార్ 107లో ఇంకో ఇళ్లు ఉంది. వీకెండ్స్ లో మాత్రమే అక్కడికి వెళ్తుంటాడు. అతనికి ఆల్కహాల్ అలవాటు కూడా ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కారులోపలే నిద్రపోయాడు. బేస్‌మెంట్ లో శనివారం రాత్రి పార్క్ చేసి అందులో నుంచి దిగలేదు.



తర్వాతి రోజు ఉదయం పండిట్ స్పృహలో లేకపోవడం అతని సోదరుడు గమనించాడు. వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

పోలీసులకు మరే విధమైన కంప్లైంట్ రాలేదు. ప్రాథమిక సమాచారం మాత్రమే తెలుసుకున్నారు.