Vijayabhaskar: మాజీ మంత్రి ఇంట్లో నమ్మలేనని ఆస్తులు.. అధికారుల చేతికి అవినీతి చిట్టా

మాజీ మంత్రి (అన్నాడీఎంకే) ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఐదేళ్లుగా అక్రమాస్తిని పోగేస్తూ.. పది రెట్లు పెంచినట్లు ఆవినీతి నిరోధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 22న అక్రమాస్తుల ఆరోపణలతో అతని ఇంటిపై దాడి చేసిన అధికారులు షాక్ అయ్యారు.

Vijayabhaskar: మాజీ మంత్రి ఇంట్లో నమ్మలేనని ఆస్తులు.. అధికారుల చేతికి అవినీతి చిట్టా

Vijaya Bhaskar

Vijayabhaskar: మాజీ మంత్రి (అన్నాడీఎంకే) ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఐదేళ్లుగా అక్రమాస్తిని పోగేస్తూ.. పది రెట్లు పెంచినట్లు ఆవినీతి నిరోధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 22న అక్రమాస్తుల ఆరోపణలతో అతని ఇంటిపై దాడి చేసిన అధికారులు షాక్ అయ్యారు. భారీగా నగదు, బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, కంపెనీ పత్రాలను సీజ్‌ చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఎంఆర్‌ విజయభాస్కర్‌ రవాణాశాఖలో ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులు, విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

చెన్నై, కరూరు జిల్లాల్లో ఏకకాలంలో 21 స్పెషల్ టీంలు మాజీ మంత్రికి చెందిన పరిశ్రమలు, బంధువుల ఇళ్లు, ఆయన అనుచరుడైన అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్‌ ఏకాంబరం ఇంటిలో గురువారం ఉదయం 6గంటల 30నిమిషాల నుంచి నిర్విరామంగా 14 గంటలపాటూ గురువారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపారు. 26 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. అధికార, అనధికార కార్యకలాపాలు జరిపే చెన్నై రాజా అన్నామలైపురంలోని అపార్ట్‌మెంటు నుంచి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్, పెన్‌ డ్రైవ్‌లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఎంఆర్‌ విజయభాస్కర్, ఆయన సతీమణి విజయలక్ష్మి, సోదరుడు శేఖర్‌ భాగస్వామ్యులుగా ఉన్న సంస్థలు, బంధువులు, సహాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో కొందరు బినామీలు చిక్కారని తెలుస్తోంది. సదరు కంపెనీల బ్యాంకు లావాదేవీలను, లాకర్లను సీజ్‌ చేశారు. 26 చోట్ల జరిగిన తనిఖీల్లో రూ.25.56 లక్షల నగదు, కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు, పెట్టుబడులు, కంపెనీలకు చెందిన లావాదేవీల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

చెన్నైలోని ఇంటి నుంచి 50 సవర్ల నగలు, రెండున్నర కిలోల వెండి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి తిరిగి ఇచ్చేశారు. దాడుల సమయంలో ఇంటిలోనే ఉన్న మాజీ మంత్రి విజయభాస్కర్‌ వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. మంత్రి పదవిలోకి రాకముందు, ఆ తరువాత ఆస్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 26 చోట్లలో స్వాధీనం చేసుకున్న నగదు, స్థిర, చరాస్తులతో పోల్చిచూసుకుని పదింతలు ఆస్తి సంపాదించినట్లు తేలిందని ఏసీబీ వర్గాలు నిర్ధారించుకున్నట్లు సమాచారం.