EC schedule : 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఒడిశా బ్రజ్ రాజ్ నగర్, కేరళలో త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మే 31న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ జరుగనుంది.

EC schedule : 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Ec

EC schedule released : దేశంలోని మూడు రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిశా బ్రజ్ రాజ్ నగర్, కేరళలో త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మే 31న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ జరుగనుంది.

ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఈ నెల 4న నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేదీ మే 11. మే12న స్క్రూటినీ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 16. మే 31న మంగళవారం పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. జూన్‌ 5 నాటికి ఉప ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

Assembly Elections : ఎన్నికల ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

కాగా, మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఏడాది జనవరి వరకు ప్రచురించిన ఓటర్‌ లిస్ట్‌ను పరిగణలోకి తీసుకుంటామని ఈసీ పేర్కొంది. అలాగే ఈవీఎంల ద్వారానే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో మోడల్‌ కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. చంపావత్ నుంచి బరిలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి నిలిచారు.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర గహటోడి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఓడిపోయినా ఆ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ అధిష్ఠానం మరోసారి సీఎంగా ఆయనకు అవకాశం ఇచ్చింది.