వేర్పాటువాద నేతపై ఈడీ కొరడా..14లక్షల ఫైన్ కట్టాల్సిందే
కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్(FEMA)నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనకు ఈడీ ఫైన్ విధించింది.
2002లో శ్రీనగర్ లోని హైదర్ పొరా ఏరియాలోని ఆయన నివాసంలో ఐటీ దాడుల సందర్భంగా సీజ్ చేసిన 10వేల అమెరికా డాలర్లను ఈడీ జప్తు చేసింది.అదేవిధంగా మరో వేర్పాటువాద నేత,జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ యాసిన్ మాలిక్ పైన విచారణ జరుగుతోంది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిూద్ ప్రమేయం ఉన్న టెర్రర్ ఫండింగ్ కేసులో సంబంధం ఉన్న గిలానీ అల్లుడు అల్తాఫ్ షా,మరికొందరిని ప్రశ్నించేందుకు బుధవారం ఈడీకి ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది.
ED Sources: Enforcement Directorate will also impose a penalty and confiscate the illegal acquisition of foreign exchange recovered from Yasin Malik, former Chairman of JKLF. The adjudication proceedings against Yasin Malik are in progress https://t.co/LYnNQNmiMf
— ANI (@ANI) 22 March 2019
Read Also : OMG : హోటల్లో సీక్రెట్ కెమెరాలు.. 1600 మంది వీడియోలు రికార్డ్, లైవ్లో ప్రసారం