యూకేకు విమాన సర్వీసులు నిలిపివేసిన భారత్

యూకేకు విమాన సర్వీసులు నిలిపివేసిన భారత్

Effect of corona virus strain, India Discontinued flights to UK  : యూకేలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రభావంతో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు విమాన సర్వీసులను భారత్‌ నిలిపివేసింది. డిసెంబర్‌ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది. అలాగే యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది.

(డిసెంబర్ 22, 2020) రాత్రి 11.59 గంట‌ల నుంచి (డిసెంబ‌ర్ 31, 2020) రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదని అని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇట‌లీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కేంద్ర విమాన‌యాన శాఖ తెలిపింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా (డిసెంబ‌ర్ 22, 2020) రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.