5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..ఆన్ లైన్ లో నామినేషన్లకు అనుమతి

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..ఆన్ లైన్ లో నామినేషన్లకు అనుమతి

Election Commission ఒక కేంద్రపాలిత ప్రాంతం,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. మే మరియు జూన్ లో నాలుగు రాష్ట్రాల(వెస్ట్ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం)అసెంబ్లీల గడువు ముగియనుంది. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీ గడువు మే-31తోటి ముగియనుంది. 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గడువు మే-30తో ముగియనుంది. 234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీ గడువు మే-24తో ముగియనుంది. 140స్థానాలున్న కేరళ అసెంబ్లీ గడువు జూన్-1తో ముగియనుంది. ఇక ఈ వారం ప్రారంభంలో పుదుచ్చేరిలో వి నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో అక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా..నాలుగు రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల తేదీలను ప్రకటించారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తమిళనాడు,కేరళ,పుదుచ్చేరిలో ఒక దశలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

అసోం ఎలక్షన్ షెడ్యూల్

అసెంబ్లీ స్థానాలు-126
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ-మార్చి2
ఎన్ని దశలు- 3
మొదటి దశ పోలింగ్- మార్చి27
రెండో దశ పోలింగ్-ఏప్రిల్ 1
మూడో దశ పోలింగ్-ఏప్రిల్-6
కౌంటింగ్ తేదీ-మే2

కేరళ ఎలక్షన్ షెడ్యూల్
అసెంబ్లీ స్థానాలు-140
ఎన్ని దశలు- 1
పోలింగ్ తేదీ-ఏప్రిల్6
కౌంటింగ్ తేదీ-మే2

తమిళనాడు ఎలక్షన్ షెడ్యూల్

అసెంబ్లీ స్థానాలు-234
ఎన్ని దశలు-1
పోలింగ్ తేదీ-ఏప్రిల్ 6
కౌంటింగ్ తేదీ-మే2

పుదుచ్చేరి ఎలక్షన్ షెడ్యూల్

అసెంబ్లీ స్థానాలు-33
ఎన్ని దశలు-1
పోలింగ్ తేదీ-ఏప్రిల్6
కౌంటింగ్ తేదీ-మే2

బెంగాల్ ఎలక్షన్ షెడ్యూల్

అసెంబ్లీ స్థానాలు-294
ఎన్ని దశలు-8
మొదటి దశ పోలింగ్- మార్చి27
రెండో దశ పోలింగ్-ఏప్రిల్1
మూడో దశ పోలింగ్-ఏప్రిల్6
నాల్గవ దశ పోలింగ్-ఏప్రిల్10
ఐదవ దశ పోలింగ్-ఏప్రిల్17
ఆరవ దశ పోలింగ్-ఏప్రిల్22
ఏడవ దశ పోలింగ్-ఏప్రిల్26
ఎనిమిదవ దశ పోలింగ్-ఏప్రిల్29
కౌంటింగ్ తేదీ- మే2

నాలుగు రాష్ట్రాలు,ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుందని, 18.68కోట్ల ఓటర్లు 2.7లక్షల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ తెలిపారు. కేవలం బెంగాల్ కి మాత్రమే కాకుండా పోలింగ్ జరుగనున్న అన్ని రాష్ట్రాలకు అవరమైన మేర కేంద్ర సాయుధ బలగాలను(CAPF) రంగంలోకి దించనున్నట్లు చెప్పారు. క్రిటికల్,మరియు ప్రమాదకరమైనది అనుకున్న పోలింగ్ స్టేషన్ లను గుర్తించడం జరిగిందని..తగినంత సంఖ్యలో CAPFలను రంగంలోకి దించనున్నట్లు చెప్పారు. బెంగాల్ లో ఎన్నికల పరిశీలన కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులను పంపనున్నట్లు చెప్పారు.

కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని సునీల్ అరోరా తెలిపారు. ఓటర్ల సేఫ్టీకే తొలి ప్రాధాన్యత అని చెప్పారు. కరోనా ఉదృతి తగ్గాక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో..డోర్​-టు-డోర్​ ప్రచారాలను నియంత్రిస్తున్నట్టు సీఈసీ తెలిపారు.అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్​ షోలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రోడ్ షోలు నిర్వహించాలని చెప్పారు. స్థానిక అధికారుల నిర్ణయం మేరకు రోడ్ షోలకు అనుమతి ఉంటుందన్నారు. ఈ సారి అభ్యర్థులు..ఆన్ లైన్ లో నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సారి ఓటింగ్ సమయాన్ని గంట పెంచుతున్నట్లు చెప్పారు. కేవలం సీనియర్ సిటిజన్లు, అనారోగ్యవంతులు,ఎసెన్షియల్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశమివ్వనున్నట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ముందే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఇక, ప్రధాన ఎన్నికల అధికారిగా.. 13 ఏప్రిల్​తో సునీల్​ అరోరా పదవీకాలం ముగియనుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం..​ తనకు ఇదే చివరి మీడియా సమావేశమన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు అరోరా
ధన్యవాదాలు తెలిపారు.