Jammu and Kashmir : కాశ్మీర్‌‌లో ఎన్ కౌంటర్.. LeT కమాండర్ హతం

భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...

Jammu and Kashmir : కాశ్మీర్‌‌లో ఎన్ కౌంటర్.. LeT కమాండర్ హతం

Jammu

LeT Commander Nisar Dar killed : దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భారత బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉండడం గమనించారు.

Read More : Uttar Pradesh : యూపీ సీఎంఓ ట్విట్టర్ హ్యాక్..

భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. ముందు జాగ్రత్తల మేరకు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేశారు. బుధవారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read More : Corona Rising: పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు: ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశం

Ansar Ghazwatul Hind, Umer Teli లష్కరే తోయిబాకు చెందిన Safat Muzaffar Sofiగా పోలీసులు గుర్తించారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రహస్యంగా వారు భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొని వస్తున్నారు. భారత బలగాలు వారిని కట్టడి చేస్తున్నారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. 2022, జనవరి నుంచి ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులు భారత బలగాల్లో హతమైనట్లు తెలుస్తోంది.