Encounter In Anantnag : ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Encounter In Anantnag : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపొరాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ పోలీసులకు సమాచారం రావడంతో, ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు.
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు ఫైర్ ఓపెన్ చేశాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇక ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతున్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో జరిగిన వేరు వేరు ఎన్కౌంటర్ల్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.