Encounter : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి .

Encounter : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter (2)

Encounter : శ్రీనగర్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గత 36 గంటల్లో కాశ్మీర్ లోయలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలోని పంథా చౌక్ ప్రాంతంలోని గోమందర్ మొహల్లా వద్ద గురువారం అర్ధరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది.

చదవండి : Encounter : అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించారు.. ఇతడు జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Encounter : కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

“ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా నేరారోపణ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది” అని కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఉటంకిస్తూ J&K పోలీస్ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇక బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.