నీరవ్ పై ఈడీ కొరడా : రూ.148 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 11:25 AM IST
నీరవ్ పై  ఈడీ కొరడా : రూ.148 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

 13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని   రూ.147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మంగళవారం(ఫిబ్రవరి-26,2019)ఈడీ అటాచ్ చేసింది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు,మెషినరీ,ఓ ప్లాంట్, జ్యూవెలరీ, పెయింటింగ్స్ తో పాటు స్థిరాస్థులు కూడా ఉన్నాయి. నీరవ్ మోడీ గ్రూప్ కు చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్,రదీషిర్ జ్యూవెలరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్,రిథమ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన స్థిరాస్తులను ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 కింద అటాచ్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. భారత్, విదేశాల్లోని రూ.1,725.36కోట్ల విలువైన నీరవ్ కు చెందిన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ స్వాధీనం చేసుకుంది.