PM Modi : 5 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు

జాతీయ విద్యా విధానం(National Education Policy)ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

PM Modi : 5 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు

Pm Modi

PM Modi   జాతీయ విద్యా విధానం(National Education Policy)ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరీకి మరియు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ విద్యా విధానాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు గడిచిన ఏడాదిగా టీచర్లు,ప్రిన్సిపల్స్,మేధావులు,దేశపు చట్ట సభల సభ్యులు చాలా కృషి చేశారని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం మన యువతకి ఏ విధమైన విద్యను అందిస్తున్నామనే దానిపైనే..భవిష్యత్తులో మనం ఎంత వరకు వెళ్లగలం,ఎన్ని ఉన్నత శిఖరాలను మనం అధిరోహించగలమేది ఆధారపడి ఉంటుందన్నారు మోదీ. కొత్త జాతీయ విద్యా విధానం..దేశ నిర్మాణం యొక్క గొప్ప త్యాగంలో ఒక పెద్ద కారకంగా ఉంటుందన్నారు. మార్పు తీసుకువచ్చేందుకు మన యువత సిద్ధంగా ఉన్నారన్నారు. మొత్తం పరిస్థితిని కోవిడ్ ఏ విధంగా మార్చేసిందనేది మనమందరం చూశామని..కానీ విద్యార్ధులు ఈ పరిస్థితునలు వెంటనే అందిపుచ్చుకున్నారని,ఆన్ లైన్ విద్య ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డేగా మారుతుందన్నారు. ప్రతి ఒక్క రంగంలో తమ సత్తా చూసేందుకు భారతీయ యువత ముందుకెళ్తున్నారన్నారు. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ని విప్లవాత్మకమైనదిగా చేస్తున్నారని అన్నారు. డిజిటల్ మీడియాకు కొత్త రెక్కలు ఇస్తున్నారన్నారు. ఇండస్ట్రీ 4.0కి భారత నాయకత్వం ఇచ్చేందుకు యువత సిద్ధమవుతుందని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఇకపై 5 ప్రాంతీయ బాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు బోధించబడతాయని తెలిపారు. ముఖ్యంగా.. పేద,దళితులు మరియు ఇతర వెనుకబడిన వర్గాల వారికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతందని మోదీ తెలిపారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు 5 భారతీయ భాషల్లో(తెలుగు,హిందీ,తమిళ్,బంగ్లా,మరాఠీ)ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో ట్రాన్స్ లేట్ చేసేందుకు ఇప్పటికే ఓ టూల్ ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రాంతీయ భాషల్లోనే తమ విద్యను ప్రారంభించనున్న విద్యార్ధులను తాను అభినందిస్తున్నానన్నారు.

మొదటిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కి లాంగ్వేజ్ సబ్జెక్ట్ హోదా ఇచ్చినట్లు మోదీ తెలిపారు. ఇకపై విద్యార్ధులు దీన్ని ఒక భాషగా కూడా చదవగలరన్నారు. మన దివ్యాంగ సహచరులకు ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.