లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన సంస్థలకే ఈపీఎఫ్ రాయితీలు

లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 05:10 AM IST
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన సంస్థలకే ఈపీఎఫ్ రాయితీలు

లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలుపై కేంద్ర  కార్మిక శాఖ దృష్టి పెట్టింది. కరోనా నివారణకు (మార్చి 24, 2020) నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. (మే 3, 202) వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది. ఉద్యోగులకు నెలవారి వేతనం చెల్లించిన సంస్థలే ఈపీఎఫ్ రాయితీలను పొందే వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ తేల్చి చెప్పింది. 

వంద లోపు ఉద్యోగులుండి  అందులో 90 శాతం మంది వేతనాలు 15 వేల లోపు ఉన్న సంస్థలకే ఈపీఏఎఫ్ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి కంపెనీలలోని ఉద్యోగుల వేతనం ప్రకారం కంపెనీ వాటా 12 శాతంతో పాటు ప్రభుత్వం చెల్లించే వాటా 12 శాతం కలుపుకుని మొత్తం 24 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులకు నెలవారి వేతనం చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ చందాను ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించిన తర్వాత ఈసీఆర్ ను కార్మిక శాఖకు, ఈపీఎఫ్ఓకు సమర్పిస్తుంది. 

తాజాగా రాయితీ పొందే సంస్థలు వేతనాలను చెల్లించి, వాటికి సంబంధించిన వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి. ఈసీఆర్ లను సమర్పించిన తర్వాత కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్ చందాను వారి యూఏఎన్ నెంబర్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ.. ఉద్యోగి పూర్తి వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిందే.

లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పని చేసిన కాలానికే వేతనాలు ఇస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తే, కార్మిక చట్టాల ప్రకారం ఆ కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ లేబర్ కమిషనర్ తెలిపారు.