EPFO : PF ఖాతాదారులకు తీపికబురు.. దీపావళి కల్లా అకౌంట్లలోకి డబ్బులు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ డబ్బులను త్వరలోనే పీఎఫ్ ఖాతాదారుల(6 కోట్ల మంది) ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చే
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ డబ్బులను త్వరలోనే పీఎఫ్ ఖాతాదారుల ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేయనుంది.
Nipah virus : ఈ పండు తినడం వల్లే కేరళలో ఆ బాలుడికి నిపా వైరస్ వచ్చిందా?
తాజా నివేదికల ప్రకారం.. దీపావళి కల్లా పీఎఫ్ వడ్డీ డబ్బులను ఖాతాదారులకు అందించనుంది. ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు వడ్డీ రేట్లకు ఆమోదం తెలిపింది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కచ్చితంగా అప్రూవల్ వచ్చిన తర్వాత వడ్డీ డబ్బులు చేరతాయి.
Vijay Sethupathi: ఇకపై కృతిశెట్టితో కలిసి నటించడం నా వల్ల కాదు
ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం లభిస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ డబ్బులు వస్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రూ.8.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇది ఏడేళ్ల కనిష్ట వడ్డీ. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా, 2017-18లో 8.55 శాతంగా 2016-17లో రూ.8.65 శాతంగా ఉండేది. 2020-21లో వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.