ఇంత నిర్లక్ష్యమా : ట్రాలీలో ఈవీఎంలు తరలింపు
ఈవీఎంలపై ఎన్ని వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలకు ఎంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లో ఉంచి భద్రత కల్పించాలి. కానీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఈవీఎంలను ఎత్తుకు పోయినా…తారుమారు చేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?
తాజాగా ఉత్తరప్రదేశ్లో ఎలాంటి భద్రత లేకుండానే ఓ ట్రాలీలో ఈవీఎంలను తరలించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈవీఎంలను తీసుకెళ్తున్న ట్రాలీ వెంట పోలీసులు కూడా లేకపోవడం గమనార్హం. పోలింగ్ పూర్తి కాగానే అధికారులు కూడా ఈవీఎంలను ట్రాలీలో వేసి చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తోంది. అనుకోకుండా ఏదైనా ఘటన జరిగితే దీనికి జవాబు చెప్పేది ఎవరు? ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.