కేంద్ర బడ్జెట్ పై ఆశలు : మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గేనా..

కేంద్ర బడ్జెట్ పై ఆశలు : మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గేనా..

GST on mobile phones : కేంద్ర బడ్జెట్‌పై అన్ని రంగాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆశిస్తున్నారు. గతంలో మేకిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సెల్యులార్ హ్యాండ్‌సెట్‌లపై కస్టమ్స్ సుంకాన్ని 20శాతానికి పెంచారు.

అయితే, ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్… మొబైల్ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్నును తగ్గించాలనే డిమాండ్‌ను మళ్లీ కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. గత ఏడాది మార్చిలో మొబైల్ పరిశ్రమపై 50శాతం పన్నును అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు చెబుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతికి కోసం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వారు భావిస్తున్నారు.

మొబైల్ ఫోన్‌లపై విధించిన జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడం అత్యవసరమని మొబైల్‌ వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోసం 500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్‌కు 200 కోట్లు కేటాయించాలని ఐసీఇఎ కేంద్రానికి సిఫారసు చేసింది.