Narendra Modi : మోడీ మీద అభిమానంతో ఓ రైతు ఏం చేశాడంటే? వీడియో వైరల్

ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.

Narendra Modi : మోడీ మీద అభిమానంతో ఓ రైతు ఏం చేశాడంటే? వీడియో వైరల్

Narendra modi

Narendra Modi : ప్రధాని మోడీ మీద అమితమైన అభిమానం చాటుకున్నాడు ఓ రైతు. ఆగి ఉన్న ఓ బస్సు మీద మోడీ ఫోటోని చూసాడు. దగ్గరకి వెళ్లి  ప్రేమగా తడిమి చూశాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోతో చెప్పుకున్నాడు. కర్నాటకలో (karnataka) జరిగిన ఈ సన్నివేశాన్ని కేంద్రమంత్రి (Union Minister) పీయూష్ గోయల్ (Piyush Goyal) తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేయడంతో  ఈ వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్ గా మారింది.

PM Modi : ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ఓ రైతు చూడటానికి చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. ఆగి ఉన్నబస్సు దగ్గరకి వచ్చాడు. బస్సుపై ఉన్న ప్రధాని మోడీ ఫోటో ముందు నిలబడి ఆప్యాయంగా తన చేతుల్తో తడిమి చూసాడు. మోడీ ఫోటోకి  తన మనసులో మాటను చెప్పుకున్నాడు. ఇంతకు ముందు తనకి రూ.1000 పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు రూ.500 అదనంగా వస్తోందని, రూ.5లక్షల రూపాయల ఆరోగ్య భీమాను మీ ప్రభుత్వం ఇస్తోందని, తమలాంటి నిరుపేదల ఇళ్లను పచ్చదనంతో నింపుతున్నావని.. మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని, మీరు చేసే మంచి కార్యక్రమాలతో మాలాంటి పేదల మనసు గెలుచుకున్నావని.. ఆ రైతు చెప్పుకున్నాడు. ఈ వీడియో  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కి చేరడంతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

Controversial Posters : ఢిల్లీలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ల కలకలం

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వీడియోలు ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో (upcoming polls) బీజేపీకి (bjp) లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు.