రైతుల ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్దం

రైతుల ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్దం

Farmers’ Tractor Rally సాగుచట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈ ర్యాలీలో 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు రంగంలోకి దిగుతుండగా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్​ మ్యాప్​ను సిద్ధమైంది. ర్యాలీ కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు. మొదటిది సింఘు సరిహద్దు నుంచి ఖర్ఖోడా టోల్​ ప్లాజా వరకు 63కి.మీల మార్గం. రెండోది టిక్రి సరిహద్దు నుంచి అసోడా టోల్​ ప్లాజా వరకు 62 కిలోమీటర్ల మార్గం. ఘజియాబాద్​ నుంచి లాల్​ ఖౌన్​ వరకు సాగే 68కి.మీల మార్గం మూడోది.

గణతంత్ర వేడుకల అనంతరం.. ర్యాలీ ప్రారంభమవుతుంది. అయితే ఎక్కడ నుంచి మొదలైందో.. తిరిగి అక్కడికి చేరుకున్న తర్వాతే ట్రాక్టర్​ ర్యాలీ ముగుస్తుంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఎవరూ మద్యం తాగవద్దని, ఆయుధాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. 24గంటలకు సరిపడా రేషన్​ తమ వద్ద పెట్టుకోవాలని సూచించారు.

రైతుల ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్​ కుట్ర పన్నిందన్న నిఘా సంస్థల హెచ్చరికతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్​ ర్యాలీ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు.. వివిధ సరిహద్దు పాయింట్లలో వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో సాధారణంగానే భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు తోడు రైతులు ర్యాలీ చేపట్టడం వల్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఫలితంగా రాజ్​పథ్​ ప్రాంతం భద్రతా వలయంలోకి జారుకుంది.. ఎవరూ మద్యం తాగవద్దని, ఆయుధాలు తీసుకురావద్దని స్పష్టం చేశారు. 24గంటలకు సరిపడా రేషన్​ తమ వద్ద పెట్టుకోవాలని సూచించారు.