Kolkata: తండ్రికి తాగించి కలిసి డిన్నర్ చేసి నిప్పుపెట్టేసిన కూతురు

తండ్రిని బయటకు తీసుకెళ్లిన కూతురు ఫుల్లుగా తాగించి ఆ తర్వాత కలిసి డిన్నర్ చేసి.. కిరోసిన్ పోసి నిప్పు పెట్టేసింది. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు ఇలా చెబుతున్నారు.

Kolkata: తండ్రికి తాగించి కలిసి డిన్నర్ చేసి నిప్పుపెట్టేసిన కూతురు

Kolkata

Kolkata: తండ్రిని బయటకు తీసుకెళ్లిన కూతురు ఫుల్లుగా తాగించి ఆ తర్వాత కలిసి డిన్నర్ చేసి.. కిరోసిన్ పోసి నిప్పు పెట్టేసింది. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు ఇలా చెబుతున్నారు. ఆదివారం రాత్రి మహిళ తండ్రితో కలిసి డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లింది.

ఆ తర్వాత కాసేపు అలా తిరిగొద్దామని చెప్పి చడ్పల్ ఘాట్ వద్దకు తీసుకొచ్చింది. హుగ్లీ నది ఒడ్డున 56ఏళ్ల తండ్రి అలా కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. తనతో పాటు తెచ్చిన కిరోసిన్ ను అతనిపై పోసి నిప్పు పెట్టింది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయింది.

సర్కస్ పార్క్ సమీపంలో ఉన్న క్రిస్టోఫర్ రోడ్ లో ఉండే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటరాగేషన్ లో తల్లి చనిపోయినప్పటి నుంచి తన తండ్రి తనను కొడుతూ ఉండేవాడని.. ఎమోషనల్ గా టార్చర్ పెట్టేవాడని చెప్పింది. తనకు వివాహం అయిన తర్వాత ఇవన్నీ ఆగిపోయాయని.. వివాహ బంధం బ్రేక్ అయి ఇంటికి తిరిగొచ్చేయడంతో మళ్లీ టార్చర్ మొదలైంది’ అని చెప్పినట్లు అధికారి వివరించారు.

మార్చి 29న కోర్టులో హాజరుపరిచేంత వరకూ ఆమె పోలీస్ కస్టడీలోనే ఉంటుంది. అప్పటివరకూ ఆమె చెప్తున్న వాటి గురించి ఆరా తీస్తాం అని వెల్లడించారు.