Indian Restaurant : అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ ధ్వంసంపై ఎఫ్బీఐ విచారణ
అమెరికాలోని న్యూ మెక్సికో రాజధాని శాంటా ఫీ నగరంలో ఇండియన్ రెస్టారెంట్పై గత ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగింది.
Indian Restaurant Destruction : అమెరికాలోని న్యూ మెక్సికో రాజధాని శాంటా ఫీ నగరంలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్పై గత ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఇండియా ప్యాలెస్ హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. గత ఏడాది జూన్లో గుర్తు తెలియని వ్యక్తులు హోటల్లోకి ప్రవేశించి కిచెన్, డైనింగ్ రూమ్, స్టోరేజ్ ఏరియాను ధ్వంసం చేశారు. ట్రంప్ 2020 అంటూ ఆ హోటల్ గోడలపై పెయింటింగ్ కూడా వేశారు.
ఆ హోటల్ యజమాని సిక్కు మతస్తుడు. ఆ దాడి వల్ల అతనికి సుమారు లక్ష డాలర్ల మేర నష్టం జరిగింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. రెస్టారెంట్పై దాడి ఘటనను విద్వేష ఘటనగా పేర్కొంటూ శాంటా ఫీ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ వర్గంపై దాడి జరిగినట్లు పేర్కొన్నారు.
Arctic : ప్రపంచానికి పెను ముప్పు..ఆర్కిటిక్ మంచు పలకలో భారీ గొయ్యి
2013లో బల్జీత్ సింగ్ అనే భారతీయ సిక్కు ఆ రెస్టారెంట్ను కొన్నారు. దాన్ని ఆయన కుమారుడు బల్జోత్ నిర్వహిస్తున్నాడు. దాడి జరిగి 16 నెలలు గడుస్తున్నా..ఇంకా ఆ కేసులో ఎలాంటి ఛార్జిషీట్ లేకపోవడంతో ఈ కేసును ఎఫ్బీఐకి అప్పగించారు. ఇండియా ప్యాలెస్ రెస్టారెంట్పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని గత వారం ఎఫ్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.