Submarines : ఆ సబ్ మెరైన్ల నిర్మాణం పూర్తిగా దేశీయ పరికరాలతోనే!

దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భార‌త్ రెడీ అయిన విషయం తెలిసిందే.

Submarines : ఆ సబ్ మెరైన్ల నిర్మాణం పూర్తిగా దేశీయ పరికరాలతోనే!

Submarines

Submarines దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భార‌త్ రెడీ అయిన విషయం తెలిసిందే. త్వరలో భారత్​లో నిర్మించే అణ్వాయుధ దాడి సామర్థ్యం గల 3 సబ్ మెరైన్ల నిర్మాణంలో 95శాతం దేశీయ పరికరాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయుధాలు, రక్షణ పరికరాల దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు పడినట్లయింది.

దేశీయంగా రూ. 50వేల కోట్లతో మూడు జలాంతర్గాముల తయారీ ప్రతిపాదనను భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పరిశీలిస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO)కి చెందిన విశాఖపట్నం కేంద్రంలో వీటిని తయారు చేస్తారు. త్వరలోనే ఈ సబ్ మెరైన్ల సంఖ్యను ఆరుకి పెంచుతారు.

ప్రభుత్వ, ప్రైవేటు సహా దేశీయ రక్షణ రంగానికి వీటి తయారీ ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చి, ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని తెలిపాయి. విదేశాల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయగలమని నమ్మకంతో ఉన్నట్లు డీఆర్​డీఓ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆ అవసరం వస్తే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల నుంచి సాయం తీసుకుంటాయని తెలిపాయి.