ఓటు వేసిన షీలా దీక్షిత్

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 03:54 AM IST
ఓటు వేసిన షీలా దీక్షిత్

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం నిజాముద్దీన్(తూర్పు)లోని పోలింగ్ బూత్ లోఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యర్థులకు తన మాట్లాడేందుకు ఏమీ దొరక్క తన ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా దీక్షిత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతంది.ఢిల్లీలోని మొత్తం 7లోక్ సభ స్థానాలకు ఇవాళే పోలింగ్ జరుగుతుంది.