అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడినందుకు యువతికి గుండు కొట్టించిన తల్లిదండ్రులు

  • Published By: vamsi ,Published On : March 1, 2020 / 06:57 AM IST
అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడినందుకు యువతికి గుండు కొట్టించిన తల్లిదండ్రులు

అబ్బాయితో ఫోన్ మాట్లాడినందుకు ఓ అమ్మాయి తల్లిదండ్రులు చేసిన పని సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తెచ్చింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఎవరో అబ్బాయితో మాట్లాడుతుందని భావించిన తల్లిదండ్రులు యువతిని కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై నలుగురిలో గుండు కొట్టించారు.

వివరాల్లోకి వెళ్తే.. అలిరాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్‌ బాలిక తెలిసిన అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడుతుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియగా.. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూతరు అనే కనికరం లేకుండా అమ్మాయిని కొట్టి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి దుర్మార్గంగా ప్రవిర్తించారు. యువతికి గుండు కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని కర్రలతో కొట్టిన కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.