జిల్లాల వారీగా అమల్లోకి లాక్‌డౌన్..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలిపారు.

జిల్లాల వారీగా అమల్లోకి లాక్‌డౌన్..

Covid

Covid Restrictions: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్‌ డెలివరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉండాలని పేర్కొన్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్‌కు ఈ ఆంక్షలు అడ్డుకావని పేర్కొన్నారు. మరోవైపు సిటీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సోషల్ ప్రోగ్రాంస్, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.

పార్క్‌లు క్లోజ్‌..
అన్ని రకాల పార్కులు సాయంత్రం వేళల్లో మూసేయాలని, ఉదయం సమయాల్లో వాకర్స్‌ కోసం తెరవాలని కమిషనర్‌ ఆదేశించారు. మాల్స్, మల్టీప్లెక్స్‌లకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు.

నిబంధనలు పాటించకపోవడం వల్లే..
కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని, దీని కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని, దీని కోసం అత్యధిక డోసులు అవసరమవుతాయని పేర్కొన్నారు.

నగరంలోని పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని నగర పాలక సంస్థ తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొత్తగా కరోనా సోకినవారిలో 90 శాతం మంది ఎత్తు అయిన భవంతుల్లో ఉంటున్న వారేనని పేర్కొంది. మిగతా 10 శాతం మంది మురికివాడలు, ఇతర ప్రాంతాలకు చెందినవారని వివరించింది. ఈ నెలలో మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందని, మురికివాడల్లో ఉంటూ కోవిడ్‌–19 సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 23వేల 2మందికి కోవిడ్‌–19 పాజిటివ్‌ వచ్చిందని, ఇందులో 90 శాతం మంది భారీ భవనాల్లో నివసించేవారని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది.

మార్చి స్టార్టింగ్ నుంచి నగరంలో కంటోన్మెంట్‌ జోన్లు 170 శాతం, సీల్‌ చేసిన భవంతుల సంఖ్య 66.42 శాతం పెరిగినట్లు పేర్కొంది. బీఎంసీ కోవిడ్‌–19 డ్యాష్‌బోర్డు ప్రకారం మార్చి 1 నాటికి నగరంలో 10 కంటైన్మెంట్‌ జోన్లు, 137 సీల్‌ చేసిన భవంతులు ఉన్నాయని, కానీ మార్చి 10నాటికి కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 27కు, సీల్‌ చేసిన భవంతుల సంఖ్య 228కి పెరిగింది. ఈ జోన్ల్ల పరిధిలో నివసించే 7.46 లక్షల మందిలో 23 శాతం మంది మురికివాడల నుంచి, మిగతా 77 శాతం సీల్‌ చేసిన భవంతుల నుంచి ఉన్నారు. ఇప్పటివరకు ముంబైలో 3లక్షల 38వేల 631 మంది కరోనా సోకగా.. 11వేల 515 మంది మరణించారు.