Ganesh Laddu: వేలంలో గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికిన వైనం
బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంలో రూ.24.60 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే, నిన్న పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో గణేశుడి లడ్డూ అంతకు మించి ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో నిన్న గణనాథుడి లడ్డూ వేలాన్ని నిర్వహించారు. సన్సిటీ కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోని గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికింది. ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ రూ.60.83 లక్షలకు దాన్ని దక్కించుకుంది.
Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంలో రూ.24.60 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే, నిన్న పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో గణేశుడి లడ్డూ అంతకు మించి ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో నిన్న గణనాథుడి లడ్డూ వేలాన్ని నిర్వహించారు. సన్సిటీ కీర్తి రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోని గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికింది. ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ రూ.60.83 లక్షలకు దాన్ని దక్కించుకుంది.
ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎన్జీవోస్లకు నిధుల రూపంలో ఇస్తామని రిచ్మండ్ విల్లాస్ సభ్యులు చెప్పారు. మరోవైపు, అల్వాల్ పరిధిలోని కానాజిగూడలోనూ గణేశుడి లడ్డూ భారీ ధర పలికింది. మరకత లక్ష్మీగణపతి ఆలయంలో లడ్డూ వేలం నిర్వహించగా హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన డా.వెంకట్రావు, గీతా ప్రియ దంపతులు దాన్ని రూ.45,99,999కు దక్కించుకున్నారు.