చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి వచ్చింది

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 09:05 AM IST
చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి వచ్చింది

తమ కూతురు చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. అయితే..కొద్ది రోజుల తర్వాత..కూతురు ఇంటికి రావడంతో అందరూ షాక్ తిన్నారు. చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సరిగ్గా నిర్ధారించకపోవడంతో ఇలా చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.



ఇటీవలే ఘజియాబాద్ లో యువతిని దారుణంగా చంపేశారు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చనిపోయింది అనే దానిపై ఆరా తీశారు. ఈ ఘటన 2020, జులై 27న చోటు చేసుకుంది. బులంద్ షహర్ లో జులై 23వ తేదీ నుంచి కనపించకుండా పోయిన బరీషా అని భావించారు.

బరీషా కుటుంబం కూడా చనిపోయింది తమ కూతురేనని వెల్లడించారు. కానీ..కొన్ని రోజులకు చనిపోయిందని ప్రకటించిన యువతి..పీఎస్ కు వచ్చింది. అందరూ షాక్ తిన్నారు. తాను చనిపోలేదని..బతికే ఉన్నట్లు చెప్పింది. కట్నం కోసం భర్త వేధిస్తుండడంతో తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని తెలిపింది.



నోయిడాలో తాను రోజు వారి జీతంతో ఫ్యాక్టరీలో పనిచేశానని తెలిపింది. దీంతో చనిపోయిందని ఆమెనని పొరపాటు పడ్డారు. అయితే..చనిపోయింది ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బులంద్ షహర్ పోలీసులు బరీషా అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు.