Lucknow : బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసి చంపేసిన గర్ల్ ఫ్రెండ్

Lucknow : బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసి చంపేసిన గర్ల్ ఫ్రెండ్

Girl angry

Girl angry : తనతో సహజీవనం చేస్తూ..వేరే యువతితో వివాహం చేసుకోవడానికి రెడీ అయిన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

పోలీసుల సమాచారం మేరకు …

ఆగ్రా..Hariparwat ప్రాంతానికి చెందిన దేవేంద్ర రాజ్ పుత్ (28), సోనమ్ లు ఓ ప్రైవేటు ల్యాబ్ లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అంతేగాకుండా..ఓ అద్దె ఇంటిని తీసుకుని అందులో సహజీవనం చేస్తున్నారు. దేవేంద్రకు అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సోనమ్ కు తెలిసింది. దేవేంద్రను నిలదీసింది. తన తల్లిదండ్రుల కోరిక మేరకు..ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో అతడిపై కోపం పెంచుకుంది.

పథకం ప్రకారం..సీలింగ్ ఫ్యాన్ రిపేర్ సాకుగా చూపి..దేవేంద్రను ఇంటికి పిలిపించుకుంది. కరెక్టు టైమ్ చూసి..అప్పటికే తెచ్చుకున్న యాసిడ్ ను అమాంతం..అతడిపై పోసింది. తీవ్రంగా గాయపడ్డ దేవేంద్ర చికిత్స పొందుతూ..శుక్రవారం మరణించాడని ఆగ్రా ఎస్పీ బీఆర్ ప్రమోద్ వెల్లడించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు..యువతిపై కేసు బుక్ చేశామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు.