కోవిడ్-19తో 20లక్షల మంది చనిపోవచ్చు: WHO హెచ్చరిక
The global death toll from COVID-19 could double to 2 million: చైనాలో పుట్టి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్కు టీకా వచ్చే సమాయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే కేసులు పెరిగితే మరణాల సంఖ్య 2 మిలియన్లకు చేరుకోవచ్చునని WHO హెచ్చరించింది. అంటువ్యాధిని నివారించడానికి కాంక్రీట్ చర్యలు తీసుకోకపోతే, ఈ సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారి చెప్పారు.
చైనాలో కరోనా వైరస్ గుర్తించిన తరువాత, చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది నెలల్లో 1 మిలియన్( 10లక్షలు) చేరుకుంది. World Health Organization అధికారి, U.N. agency హెడ్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ కేసులు ప్రపంచంలో పెరగడానికి యువత కారణం అని చాలామంది నిందిస్తున్నారని ఆయన అన్నారు. అయితే, కరోనా వ్యాప్తికి యువతను కారణంగా చెప్పరాదని, లాక్డౌన్లు విధించి సడలింపులు చేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే విషయం అని అధికారి అన్నారు.
ప్రపంచంలో కరోనా విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేయడం మానేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత కారణంగా సంక్రమణ కేసులు పెరగడం వల్ల మాత్రమే కనిపిస్తుంది. అతను చెప్పాడు, “ఒక యువకుడికి సరైన దిశ మరియు సలహా ఇవ్వగల పెద్దవాడు అవసరమని మేము గుర్తుంచుకోవాలి.” ప్రజల మధ్య సామాజిక దూరం లేని సమావేశాలు కారణంగానే వైరస్ పెరిగిపోతుందని, ఇది అన్ని వయసుల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
ఇక టీకా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమమైన కోవాక్స్లో చైనాలో చేరడానికి డబ్ల్యూహెచ్ఓ చర్చలు జరుపుతోంది. తద్వారా ప్రపంచంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ మరియు పంపిణీని వేగవంతం చేయవచ్చు అని భావిస్తుంది.
డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు బ్రూస్ ఆయిల్వార్డ్ మాట్లాడుతూ, WHO కోవాక్స్ కార్యక్రమంలో పాల్గొనే దేశాల సంఖ్య 159 కు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే కోవిడ్-19 టీకా వచ్చే సమయానికి ప్రపంచంలో 20లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు స్పష్టం చేశారు.