Indian Railways: సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. రాయితీ పునరుద్ధరించే అవకాశం?

కోవిడ్ సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గడం, రైల్వే నష్టాల్లో ఉండటంతో ప్రయాణికులకు టిక్కెట్లపై ఇచ్చే రాయితీని కేంద్రం ఎత్తివేసింది. వృద్ధులకు కూడా రాయితీ తొలగించింది. కొందరికి రాయితీ తిరిగి పునురద్ధరించినప్పటికీ, వృద్ధులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

Indian Railways: సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. రాయితీ పునరుద్ధరించే అవకాశం?

Indian Railways: సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది. గతంలో రద్దు చేసిన టిక్కెట్లపై రాయితీని తిరిగి పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రెండేళ్లక్రితం కోవిడ్ సమయంలో రైళ్లు చాలా కాలం రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం రైళ్లు పాక్షికంగానే నడిచాయి.

MLC Kavitha: వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై కేంద్రం దాడులు: ఎమ్మెల్సీ కవిత

అయితే, ఆ సమయంలో నష్టాల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అనేక విభాగాల్లో టిక్కెట్లపై ఇచ్చే రాయితీని ఎత్తేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా తొలగించింది. దీనిపై అప్పట్లోనే కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంటులో నలుగురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఆగష్టు 4న ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని సూచించింది.

TTD: శ్రీవారి లడ్డూలపై ఆ ప్రచారం నమ్మొద్దు.. టీటీడీ ప్రకటన

స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీల్లో రాయితీ ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ప్యాసింజర్ల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వెంటనే రాయితీ అమలు చేయాలని సూచించింది’’ అని మంత్రి ప్రకటించారు. దీంతో త్వరలోనే కేంద్రం రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. కాగా, 2019లో ప్రయాణికులకు రూ.59,837 కోట్ల రాయితీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికీ దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.