Odisha : ఒడిశాలో ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన రైలు..ముగ్గురు మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొరాయి రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఏకంగా ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Odisha : ఒడిశాలో ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన రైలు..ముగ్గురు మృతి

Goods train hit by derailment in Jajpur

Goods train hit by derailment in Jajpur : ఒడిశాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొరాయి రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఏకంగా ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 10 బోగీలు బోల్తా పడ్డాయి. సోమవారం (నవంబర్ 21,2022) ఉదయం జజ్ పూర్ జిల్లాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్)లోని ఖోర్ధా రోడ్డు రైల్వే డివిజన్ పరిధిలోని భద్రక్-కపిలాస్ రోడ్ రైల్వే సెక్షన్ లోని కొరాయి స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు అదుపు తప్పి ప్లాట్ ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బోల్తా పడిన దాదాపు 10 బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ శిథిలాల కింత పలువురు చిక్కుకుపోయారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గూడ్స్ రైలు డోంగోపోసి నుండి ఛత్రపూర్ వైపు వెళుతోంది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, ఆర్పీఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ లలో జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో చేర్పించారు. ఈ ఘటన కారణంగా స్టేషన్‌ భవనం కూడా దెబ్బతిన్నదని ఈసీఆర్‌ తెలిపారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయి కలిగింది.