TRS MLAs trap issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కొనసాగుతున్న క్రమంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.

TRS MLAs trap issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన

Governor Tamilisai's Delhi tour

TRS MLAs trap issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి కుట్ర జరిగింది అనీ దీనికి మొయినాబాద్ ఫాంహౌస్ ను వేదికగా మారింది అనే ఘటన తెలంగాణలో వేడి పుట్టిస్తోంది. ఈ కుట్ర బీజేపీయే చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాదు ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగుతోంది. ఇలా తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వేడెక్కిస్తోంది. ఇటువంటి సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మంగళవారం (నవంబర్ 1,2022) గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లనున్నారు.

రాష్ట్రంలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక గురించి..మొయినాబాద్ ఫాంహౌజ్ లో జరిగిన వ్యవహారాల గురించి ఢిల్లీ పెద్దలు వివరించే అవకాశం ఉంది. దీంతో గవర్నర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లనున్నారు తమిళిసై. ఎమ్మెల్యేక కొనుగోలు వ్యవహారం సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

అసలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి..రాజ్ భవన్ కు మధ్య గత కొంతకాలంలో జరుగుతున్న కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళిసైపై టీఆర్ఎస్ నేతల విమర్శలు చేస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లోను గవర్నర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య మంటలు రేపుతూనే ఉంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు పరిణామాలను ఢిల్లీ పెద్దలకు గవర్నర్ రిపోర్టు ఇవ్వనున్నారు. పైగా మునుగోడు ఉప ఎన్నిక మరో కొద్దిరోజుల్లో జరుగనుంది. ఈక్రమంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన పెను ఆసక్తిని కలిగిస్తోంది.