చైనాపై అణ్వాయుధ క్షిపణిని ఎక్కుపెట్టిన ఇండియా

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 05:26 PM IST
చైనాపై అణ్వాయుధ క్షిపణిని ఎక్కుపెట్టిన ఇండియా

Indian shaurya missile: ఇండియా టార్గెట్ ఒక్కటే. సరిహద్ధుల్లో చైనా, పాక్‌లను కంట్రోల్ చేయండి. అందుకే మిస్సైల్ వ్యూహాన్ని అమలుచేస్తోంది.

భారత్‌ క్షిపణి పరీక్షల ప్రయోగాన్ని ముమ్మరం చేసింది. మరో రెండు క్షిపణులను ప్రయోగించింది. జలాంతర్గాముల విధ్వంసక టోర్పడో పరీక్ష విజయవంతం కావడం అంటే శత్రువును నిలువరించేలా మరో అడుగుపడినట్లే.



శౌర్య అణ్వాయుధాలను ప్రయోగించే హైపర్‌సోనిక్ క్షిపణి. దీని స్ట్రైకింగ్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు. ఒడిశా ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో శనివారం ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. 2018 ఆగస్టులో పరీక్షించిన కె-15 సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్‌కు ఇది ల్యాండ్ వేరియంట్ . భూమి పై నుంచి భూమి పై ఉన్న లక్ష్యాలపై శౌర్య క్షిపణి ప్రయోగిస్తారు. పది మీటర్ల పొడవు. 74 సెంటీమీటర్ల చుట్టుకొలత. బరువు ఆరు టన్నుల రెండొందల కిలోలు.


శౌర్య స్పెషాలిటీ
nuke-capable Shaurya missileని ఒక ట్రక్కు పై ఎక్కడికైనా తీసుకెవెళ్ళవచ్చు. ట్రక్కు పై నుంచే దీన్ని ప్రయోగించవచ్చు . శత్రువు కంట పడకుండా దీన్ని దాచిపెట్టవచ్చు . ఉపగ్రహాలు కూడా దీని ఆచూకీ కనిపెట్టలేవు.



పది రకాల బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ఇండియా వద్ద ఉన్నాయి. వాటిలో రెండు వేరియంట్లు పృథ్వి , అయిదు వేరియంట్లు అగ్ని క్షిపణులు. ధనుష్, ప్రహార్, ప్రగతి కూడా ఇదే రకం క్షిపణులు. కాకపోతే వీటి రేంజ్, పే‌లోడ్, బరువు వేరువేరు. ఇవికాక, ఆరు వేరియంట్ల బ్రహ్మోస్ క్షిపణులున్నాయి. ఇవన్నీ క్రూయిజ్ క్షిపణులు. మరో క్రూయిజ్ క్షిపణి నిర్భయకూడా ఇండియా వద్ద ఉంది.

ఇవికాక జలాంతర్గాముల నుంచి ప్రయోగించే మరో రెండు బాలిస్టిక్ క్షిపణులు ఇండియా క్షిపణి ఆయుధాగారంలో ఉన్నాయి.