Bad Bank : బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌..రుణ వసూళ్లు పెరిగాయన్న ఆర్ధికమంత్రి

బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది.

Bad Bank : బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌..రుణ వసూళ్లు పెరిగాయన్న ఆర్ధికమంత్రి

Nirmala (1)

Bad Bank  బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకోసం ఏర్పాటు చేయబోతున్న నేషనల్‌ అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (NARCL) లేదా బ్యాండ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రశీదులకు ప్రభుత్వ హామీ ఇస్తుందని తెలిపారు. ఈ హామీ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ 15 శాతం రుణాలకు నగదు రూపంలో చెల్లించనుండగా, మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీ కలిగిన సెక్యూరిటీ రసీదులను జారీ చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు.

దేశీయ బ్యాంకులు కొన్ని ఏళ్లుగా ఎన్‌పీఏల సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి ఈ ఎన్‌పీఏల విలువ రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుదన్న అధ్యయనాల నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు గురించి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు.

దేశీయ బ్యాంకులు కొన్ని ఏళ్లుగా ఎన్‌పీఏల సమస్య ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2022 నాటికి ఈ ఎన్‌పీఏల విలువ రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుదన్న అధ్యయనాల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ ప్రసంగంలో బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు గురించి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. బ్యాడ్‌ బ్యాంకు ప్రారంభంలో హామీ మొత్తం గరిష్టంగా రూ.31,000 కోట్లుగా నిర్ణయించారు. ఈ బ్యాడ్‌ బ్యాంకులో లీడ్‌ స్పాన్సర్‌గా 12 శాతం వాటాతో కెనరా బ్యాంకు వ్యవహరించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలిసి ఎన్‌ఆర్‌సీఎల్‌లో 51 శాతంను కలిగి ఉంటాయి. వీటిని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో కలుపుతారు. ఎన్‌ఆర్‌సీఎల్‌ను ఏర్పాటుచేయడంపై చర్చలు తీసుకోవాలని ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంకును ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు, తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా రుణాల వసూళ్లు పెరిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. రికగ్నేషన్‌, రిజల్యూషన్‌, రీక్యాపిటలైజేషన్‌, రిఫార్మ్స్‌ వల్ల గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల మేర రుణాలు వసూలయ్యాయని పేర్కొన్నారు. 2018 మార్చి తర్వాత రూ.3.1 లక్షల కోట్లు రుణాలు రికవరీ అయినట్లు తెలిపారు.