YouTube Channels: 35 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన మోదీ ప్రభుత్వం

భారత్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్‌లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది.

YouTube Channels: 35 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన మోదీ ప్రభుత్వం

You Tube

YouTube Channels: భారత్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్‌లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. జనవరి 20వ తేదీన మినిస్ట్రీకి అందిన ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తోన్న ఈ ఛానెళ్ల నుంచి తప్పుడు సమాచారం ప్రసారం అవుతోందని గుర్తించారు.

పాకిస్తాన్ వేదికగా ఈ ఛానెళ్లు పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఏజెన్సీ సమాచారంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయా ఛానళ్లు, వెబ్ సైట్లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఛానెళ్ల ద్వారా భారత వ్యతిరేక వార్తలు.. వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. అంతకుముందు జనవరి 19 న, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే “కుట్రదారుల”పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు ఇటువంటి చర్యలను గుర్తిస్తున్నాయని, భారత్ కూడా ఈ విషయంలో ముందు ఉన్నట్లు స్పష్టం చేశారు. యూట్యూబ్ కూడా వారిని బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టిందని ఈ సంధర్భంగా చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయంతో కూడిన ప్రయత్నంలో, భారతదేశానికి వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన 20 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది.

కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ, భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలు, రామమందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై కంటెంట్‌ను విద్వేషపూరితంగా పోస్ట్ చేస్తున్నట్లుగా మంత్రిత్వ శాఖ పేర్కొంది.