Karnataka : ఇద్దరు తోబుట్టువులను పెళ్లి చేసుకున్న యువకుడు..ఎందుకు

Karnataka : ఇద్దరు తోబుట్టువులను పెళ్లి చేసుకున్న యువకుడు..ఎందుకు

Karnataka

Groom Marries Both Siblings : ఒకే ముహూర్తానికి ఇద్దరు తోబట్టువులను పెళ్లి చేసుకున్నాడో ఓ యువకుడు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే..అసలు ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ?

కర్ణాటక రాష్ట్రం ముళబాగు తాలుకాలోని Vegamadagu ప్రాంతంలో ఉమాపతి యువకుడు నివాసం ఉంటున్నాడు. సమీప బంధువైన లలితో వివాహం నిశ్చయమైంది. దీనికి ఉమాపతిని వివాహం చేసుకొనేందుకు లలిత కూడా ఒప్పుకుంది. అయితే..పెళ్లి చేసుకొనేందుకు ఓ కండీషన్ పెట్టింది. మూగగా ఉన్న

తన చెల్లి సుప్రియను కూడా వివాహం చేసుకోవాలని సూచించింది. ముందుగా షాక్ తిన్న ఉమాపతి తర్వాత..ఒప్పుకున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో నిరాడంబరంగా వివాహం జరిపించాలని ఇరువురు కుటుంబసభ్యులు భావించారు. కొలార్ జిల్లాలో ఉన్న Kurudumale దేవాలయంలో అతి తక్కువ మంది సమక్షంలో మే 7న వారి పెళ్లి జరిగింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే..సుప్రియ తండ్రి నాగరాజప్ప కూడా ఇద్దరి తోబుట్టువులను (రాణియమ్మ, సుబ్బమ్మ)లను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు మూగవారు.

Read More : Vaccination Drive : తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్, వ్యాక్సినేషన్‌కు బ్రేక్