ప్రాణం తీసిన నమ్మకం : గర్భిణిని చంపి ఫామ్ హౌస్ లో పాతిపెట్టేశాడు

  • Published By: nagamani ,Published On : November 24, 2020 / 12:52 PM IST
ప్రాణం తీసిన నమ్మకం : గర్భిణిని చంపి ఫామ్ హౌస్ లో పాతిపెట్టేశాడు

Gujarat man murder pregnant women : భర్తతో విభేదాలు వచ్చి విడిపోయి దూరంగా బతుకుతున్న ఓ గర్భిణిపై ఓ కామాంధుడు కన్నేశాడు. నీ కష్టంలోను సుఖంలోనే తోడుగా ఉంటాను..నీకు అండగా నేనున్నానని నమ్మించాడు. అన్ని రకాలుగా వాడుకున్నాడు. ఆ తరువాత ఆమెను వదిలించుకోవటానికి గర్భిణి అని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేసి జేసీబీతో గొయ్యి తవ్వి ఫామ్ హౌస్ లో పాతిపెట్టేసిన ఘటన గుజరాత్ లోని బర్దోలీలో సోమవారం (నవంబర్ 23,2020) రాత్రి బైటపడింది.

వివరాల్లోకి వెళితే..బర్దోలీకి చెందిన రష్మీ కటారియా అనే మహిళ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె ఐదు నెలల గర్భవతి. అప్పటికే మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉంటున్న రష్మీపై ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న చిరాగ్‌ పటేల్‌ అనే వ్యక్తి కన్నేశాడు. భర్తకు దూరంగా ఉండటాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.ఫ్రెండ్ అంటూ చేరాడు. తోటి మనిషి మనిషి సహాయం చేసుకోవాలంటూ మాయమాటలు చెప్పాడు. చిన్న చిన్న అవసరాలు తీర్చేవాడు. అలా అతను మంచివాడని నమ్మింది రష్మీ.

https://10tv.in/software-engineer-killed-in-jagtial-district/

అతన్ని పూర్తిగా నమ్మిన రష్మీ అతనితో జీవితం పంచుకోవాలనుకుంది. దీంట్లో భాగంగా అన్ని రకాలుగా ఇద్దరూ దగ్గరయ్యారు. కొంతకాలం రష్మీని చిరాగ్ నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తరువాత ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ ఇవేమీ తెలియని రష్మీ అతన్ని పూర్తిగా నమ్మింది. గత ఆదివారం (నవంబర్ 22,2020) రాత్రి రష్మీ తన మూడేళ్ల కొడుకుని తన తల్లి ఇంటిలో ఉంచి వెళ్లింది. కానీ మళ్లీ తిరగిరాలేదు. తెల్లారింది. కానీ కూతురు తిరిగి రాకపోవటంతో రష్మీ తల్లి అనుమానం వచ్చింది. రష్మీ ఎంతకూ తిరిగి రాకపోవడంతో భయపడిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు రష్మీ కోసం వెదికారు కానీ కనిపించలేదు. దీంతో ఎవరిమీదైనా అనుమానం ఉందాని అడగటంతో ఇటీవల కూతురుతో కలిసి ఉంటున్న చిరాగ్‌ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె అతనితో గతకొంత కాలంగా సహజీవనం చేస్తోందని..ఆదివారం వచ్చి వెళ్లిన తను కూతురు అప్పటి నుంచి కనిపించట్లేదని చెప్పారు.

 

దీంతో చిరాగ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలను వెల్లడించాడు చిరాగ్. రష్మీని హత్య చేసి జేసీబీతో గొయ్యి తీసి తన తండ్రి ఫాంహౌస్‌లో పూడ్చిపెట్టానని చెప్పాడు. ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి విభేదాలు వచ్చాయని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందనీ అందుకే ఆమెను వదిలించుకోవటానికి హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Gujarat women Rammi murder

దీంతో అప్పటి వరకూ రష్మీని మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చిరాగ్ పై హత్య చేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేశారు. అలాగే అప్టికే చిరాగ్‌ కు వివాహం అయిందని తెలుసుకుని చిరాగ్ భార్యపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఆమె రష్మీపై దాడి చేసిందని తమ దర్యాప్తులో తేలింది. ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఘటనాస్థలిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.