Woman Death : దారుణం.. అమ్మవారు పూనిందని కొట్టి చంపేశారు

ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో మనిషి

Woman Death : దారుణం.. అమ్మవారు పూనిందని కొట్టి చంపేశారు

Woman Death

Woman Death : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో మనిషి మృగంలా మారుతున్నాడు. తోటి మనిషిని కొట్టి చంపుతున్నాడు. అలాంటి దారుణం ఒకటి గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో జనాలు అమానుషానికి ఒడిగట్టారు. నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు.

కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుందేమోనని భయపడి ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి(25) అనే మహిళ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సమీపంలోని ఒఖంబది గ్రామానికి తన భర్త వలాతో కలిసి వెళ్లింది. ఉత్సవాల్లో పాల్గొన్న రమీలా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది.

Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

అయితే ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేశ్‌ సోలంకి అక్కడి ప్రజలను నమ్మించాడు. కోపంతో ఉన్న అమ్మవారిని పారదోలాలని.. లేదంటే ఆమె అందరిని చంపేస్తుందని భయపెట్టాడు. అంతేకాదు కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు.

‘అన్‌స్టాప‌బుల్‌’ షో కోసం బాలయ్య ఆహా అనిపించే పారితోషకం

ఇది నిజమేనేమో అని నమ్మిన అక్కడున్న ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడి చేసిన ఇనుప గొలుసులతో రమీలాను చావబాదారు. తీవ్ర గాయాలతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో భూతవైద్యుడు రమేష్ సోలంకి, మృతురాలి బంధువులు అర్జున్ సోలంకి, వెర్సి సోలంకి, మను సోలంకి, భవేష్ సోలంకి ఉన్నారు.