మట్టి తవ్విందనే కోపంతో కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి హత్య

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 04:03 AM IST
మట్టి తవ్విందనే కోపంతో కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి హత్య

కుక్కపిల్ల గొంతుకు గుడ్డ కట్టి దారుణంగా హత్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్స్ కోల్పోయిన వ్యక్తి.. కుక్క పిల్ల గొంతుకు స్కార్ఫ్ కట్టి గిలగిల కొట్టుకుంటూ కొనఊపిరి పోయేంత వరకూ చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులకు సమాచారం అంది నిందితుడిపై కేస్ ఫైల్ చేశారు.

 

పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్ సభ్యులు (PETA) గాంధీధం పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడ్ని ట్రేస్ చేసిన పోలీసులు శుక్రవారం పట్టుకుని కుచ్ పట్టణం ఆదిపూర్ ప్రాంతానికి తీసుకొచ్చారు. రిసార్ట్ లో ఆ వ్యక్తి ట్రైనీ వైటర్ కింద పనిచేస్తున్నాడు.

నాగాలాండ్ నుంచి సంగటం(21) అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కపిల్ల గదిలో మట్టి తవ్వింది. దానిని ఫొటో తీయడంతో పాటు గొంతుకు గుడ్డ కట్టి కొన ఊపిరి పోయేంత వరకూ చూస్తూ పైశాచిక ఆనందం పొందాడు. నిందితుడు కుక్కపిల్లను చంపి అధికారులకు సాకులు చెప్పడం మొదలుపెట్టాడు.

కుచ్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) ఆదిపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్కే చౌదరి పెటా సభ్యులు నేహా చతుర్వేది చేసిన కంప్లైంట్ తీసుకుని విచారణ జరిపారు. దాంతో పాటు కుక్కపిల్లను హత్య చేసిన వీడియోను అటాచ్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.

ఐపీసీ సెక్షన్లు 429, 11(1)(A), 11(1)(I)ల కింద కేసు నమోదు చేశారు. COVID-19 పరీక్షలు నిర్వహించి అతణ్ని అరెస్ట్ చేశారు.

Read: ఆన్ లైన్ క్లాసులతో విద్యార్ధుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి