Gujarat Cabinet : కొలువుదీరిన కొత్త మంత్రివర్గం..అందరూ కొత్తవాళ్లే
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Gujarat Cabinet గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గురువారం గాంధీనగర్లోని రాజ్భవన్లో.. గవర్నర్ ఆచార్య దేవ్రాత్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే ఈ మంత్రివర్గంలో అంతా కొత్తవారే నియమితులు కావడం విశేషం.మాజీ సీఎం విజయ్ రూపానీ కేబినెట్లోని ఒక్కరికి కూడా ఇప్పుడు చోటుదక్కకపోవడం గమనార్హం. సీఎం పదవిని ఆశించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్కు కూడా కేబినెట్లో చోటు కల్పించలేదు.
శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జితూ విఘ్నానీ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్ ఆచార్య దేవ్రాత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అభినందించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్ మార్క్ పాలనను కొనసాగించాలని సూచించారు.
కొత్త మంత్రులు
.గజేంద్ర సిన్హ్ పర్మార్, రాఘవ్జీ మక్వానా, వినోద్ మొరాడియా, దేవభాయ్ మాలం, హర్ష్ సంఘ్వీ, ముఖేశ్ పటేల్, నిమిష సుతార్, అర్వింద్ రాజ్యాని, కుబేర్ దిన్దాన్, కీర్తిసిన్హ్ వాఘేలా, జగ్జీశ్ పంచాల్, బ్రిజేశ్ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్, కానూ భాయ్ దేశాయ్, కీర్తిసిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్సిన్హ్ పర్మార్, అర్జున్ సిన్హ్ చౌహాన్, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, పూర్ణేశ్ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. కాగా, 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్ ఈ టీమ్తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు.
కాగా, అయిదు రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీని అనూహ్యంగా తొలగించి భూపేంద్ర పటేల్ను సీఎంగా బీజేపీ నియమించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ రూపానీ పని తీరుపై అసంతృప్తి, 2022లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోణంలో ఆయనను తొలగించారని భావిస్తుండగా.. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేలా మంత్రివర్గం ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ.
READ Kanhaiya Kumar : కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్!