Punjab elections : పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం..

పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ లేఖ రాశారు.

Punjab elections : పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం..

Punjab Elections Likely To Be Postponed

Punjab elections likely to be postponed : పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ లేఖ రాశారు. ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్‌ నేత, పంజాబ్ సీఎం చరణ్ జిత్ జనవరి 13న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్‌ చంద్రకు లేఖ రాశారు.

ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి వేడుకల జరుగనున్న క్రమంలో బెనారస్‌ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరానని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ లో దళిత వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్నారని వారి మనోభావాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం లేఖలో ప్రస్తావించారు.

Also Read : Postage Stamp on Covaxin : కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ

ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్ లోని బెనారస్‌లో జరగనున్న గురు రవిదాస్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి 20లక్షల మంది బెనారస్ వెళ్లే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ క్రమంలో ప్రకటించిన షెడ్యూల్‌ ను మార్చాలని ఈసీని కోరారు. ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం..పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నిక అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే..లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు.

కాబట్టి ప్రజల మనోభావాలను గౌరవిస్తు పోలింగ్‌ తేదీని పొడిగించినట్లయితే బెనారస్‌ వెళ్లి రావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోగలుగతామని లేఖలో సీఎం వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా కనీసం ఆరు రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సీఈసీని కోరారు. అలాగే ఫిబ్రవరి 14న పోలింగ్ వద్దంటూ వివిధ పార్టీలు కూడా కోరుతున్నాయి. సీఎం సీఎం చరణ్ జిత్ చన్నీ రాసిన లేఖపై ఎన్నికల సంఘం కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది.

Also read : Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు

కాగా.. మాఘ మాసంలో పౌర్ణమి రోజున గురు రవిదాస్‌ జయంతి వేడుకలగ జరుపుకుంటారు. ఈ వేడుకలు రవిదాస్సియా మతానికి వార్షిక కేంద్ర బిందువుగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

కులవివక్షకు వ్యతిరేకంగా గురు రవిదాస్‌ చేసిన కృషి కారణంగా ఆయన ఆధ్యాత్మిక వ్యక్తిగాను..సంఘ సంస్కర్తగా కూడా గుర్తింపు పొందారు. గురు రవిదాస్‌ కబీర్‌కు సమకాలీనుడు. రవిదాస్ జీ సీర్ గోవర్ధన్‌పూర్ గ్రామంలో జన్మించారు.