Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు

తమకు పెళ్లికి పిలిచి వదిలేసి బారాత్ కు వెళ్లిపోయాడని వరుడిపై అతని స్నేహితులు రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు.

Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు

Haridwar Groom Sued By Friends For Rs 50 Lakh

Haridwar groom sued by friends for Rs 50 lakh: పెళ్లి చేసుకునే వరుడు తన బంధువులతో స్నేహితులను పిలుచుకుంటాడు. పెళ్లిలో వరుడి స్నేహితులు చేసే సందడే వేరు. ముఖ్యంగా వధువు స్నేహితులను..అందమైన ఆడపిల్లలను ఆటపట్టిస్తుంటా వరుడు స్నేహితులు. అదొక సందడి..సరదా..పెళ్లిలో ఇటువంటి సరదా సరదా సంఘటనలు ఉంటేనే బాగుంటుంది. కానీ పాపం తన పెళ్లికి స్నేహితులను పిలుచుకున్న వరుడు మాత్రం తన స్నేహితులు చేసిన పనికి డంగైపోయాడు. షాక్ అయ్యాడు. ఎందుకంటే పెళ్లికొచ్చి సరదా చేసి చక్కగా హడావిడి చేయాల్సిన స్నేహితులు వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు. అది తెలిసి పాపం ఆ వరుడు షాక్ అయ్యాడు. ఇంతకీ స్నేహితులే అలా ఎందుకు చేశారంటే..

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి జరిగింది. తన పెళ్లిలో తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్‌ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన ఫ్రెండ్స్ లో బాగా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్ సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా వివాహానికి బయలుదేరుతున్నామని, స్నేహితులందరూ తప్పక బారాత్‌లో పాల్గొనాలని అతని స్నేహితుడిద్వారా అందరికీ ఇన్విటేషన్లు పంపాడు. పెళ్లి రోజున స్నేహితులందరు అనుకున్న సమయానికి వరుడు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు.

ఇది తెలిసిన స్నేహితులు పట్టరాని ఆగ్రహంతో వరుడికి ఫోన్‌ చేశారు. అయితే వారు రావడం ఆలస్యమైందని, అందుకే వెళ్లిపోయామని పెళ్లి కుమారుడు చెప్పాడు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు. దీంతో వరుడి తీరుపై చంద్రశేఖర్ అనే స్నేహితుడు మండిపడ్డాడు. పెళ్లికని పిలిచి ఇలా అవమానిస్తావా? అంటూ ఫైర్ అయిపోయాడు. అక్కడితో ఊరుకోలేదు. నీ సంగతి చెబుతానుండి. ఇంతకింతా చేయకుండా ఊరుకుంటానా? అంటూ వెంటనే న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు తమ గౌరవాన్ని దెబ్బతీసినందుకు వరుడిపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. పెళ్లికి ఆహ్వానించిన స్నేహితులు, అతిథులతోపాటు దానికి పురమాయించిన తనను మానసికంగా హింసించినట్లు అందులో ఆరోపించాడు.