IPS Bharati Arora : ‘కృష్ణుడికి సేవ చేసుకోవాలి’ అంటూ రిజైన్ చేసిన మహిళా ఐపీఎస్
నేను శ్రీకృష్ణుడికి సేవకు అంకితం అవ్వాలనుకుంటున్నానంటూ ఓ సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఇప్పటి వరకు నా జీవితం..నా ఉద్యోగం అంతా అశాశ్వతమని తెలిసింది. అందుకే కృష్ణుడి సేవలో తరించాలనుకుంటున్నా..ఆయన సేవకు అంకితం అవ్వాలనుకుంటున్నా అని తెలిపారు ఐపీఎస్ భారతీ అరోరా.
Women IPS Officer seeks vrs to serve lord krishna : ఐపీఎస్ అవ్వటం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడాలి. అలా ఎంతోకష్టపడి..ఇష్టపడి సాధించిన ఐపీఎస్ హోదాను తృణప్రాయంగా భావించి ఉద్యోగానికి రిజైన్ చేశారు ఓ మహిళా అధికారి. దానికి ఆమె చెప్పిన కారణం ఉన్నతాధికారులనే విన్నవారందరినీ షాక్ కు గురిచేసింది. వీఆర్ఎస్ తీసుకోవటానికి ఆమె చెప్పిన కారణం చర్చనీయాంశంగా మారింది. ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిణి పేరు భారతి అరోరా. ఇంతకీ ఆమె చెప్పిన కారణం ఏమిటంటే..భగవాన్ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమవ్వాలనుకుంటున్నాను. అందుకే స్వచ్ఛందంగా పదవీ విరమణ (వీఆర్ఎస్) కోరుతున్నాను అని అప్లికేషన్ లో రాశారు భారతి అరోరా.
2007 సంజౌతా ఎక్స్ప్రెస్ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నాయకత్వం వహించిన ధీర భారతీ అరోరా. ప్రస్తుతం గుర్గావ్ జాయింట్ కమిషనర్ (ఐజీ) కొనసాగుతున్న ఆమె స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లికేషన్ పెట్టుకుంటూ అప్లికేషన్ లో భగవాన్ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమవ్వాలనుకుంటున్నాను..అందుకే వీఆర్ఎస్ కోరుతున్నా..అని అప్లికేషన్ లో రాసి..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్ధన్ తో పాటు డీజీపీ మనోజ్ యాదవ్ కు కి దరఖాస్తు పంపారు. 1998 బ్యాచ్కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారు.‘నాకు శ్రీకృష్ణుడు అంటే ఎనలేని భక్తి..ఆయనకు సేవ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. కృష్ణుడికి సేవ చేయటం గర్వంగా భావిస్తున్నాను..నేను జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో నేను నా లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. గురునానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీద్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను’ లేఖలో పేర్కొన్నారు భారతీ అరోరా.
తన పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్న సందర్భంగా భారతీ మాట్లాడుతూ..నేను డ్యూటీలో పడి సేవామార్గాన్ని వదిలేశాను..కానీ ఇది శాశ్వతం కాదని తెలిసింది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంటున్నాను..భగవంతుని సాక్షాత్కారం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను..ఆయన సేవలోనే తరిస్తాను’ అని తెలిపారు.ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరతారా? అని కొంతమంది తనను అడుగుతున్నారని..నాకా ఉద్దేశం లేదని.. ఆధ్యాత్మిక వైపే నా మనస్సు లాగుతోందని అందుకే నా పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను. అందుకే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు పెట్టానని తెలిపారు.
కాగా..భారతీ అరోరా భర్త వికాస్ అరోరా కూడా ఐపీఎప్ అధికారే. రేవారి ఐజీ (సౌత్ రేంజ్)గా పోస్టింగ్ ఇచ్చారు. 2007 ఫ్రిబవరిలో సంజౌతా ఎక్స్ప్రెస్ బాంబు దాడి ఘటనపై అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఆ టీమ్ కు భారతి అరోరా ఎస్పీ (రైల్వే) నాయకత్వం వహించారు. పానిపట్ సమీపంలో జరిగిన బాంబు దాడిలో 68 మంది మృతి చెందారు. ఆ తర్వాత 2013లో గుర్గావ్లో ఉమ్మడి సీపీగా బాధ్యతలు స్వీకరించారు.గుర్గావ్ లో ఎక్స్ప్రెస్వేలో ట్రాఫిక్ డ్యూటీలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. నిబంధనలు అతిక్రమించినవారు ఎంతటివారినైనా ఆమె లెక్క చేసేవారు కాదు. కానీ.. అత్యాచారం కేసు విషయంలో సీపీ నవదీప్ సింగ్ విర్క్పై సంచలన ఆరోపణలు చేశారు. కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించాడని..తనపై సీక్రెట్ గా నిఘా పెట్టారని ఆరోపించారు. ఆమె ఆరోపణలకు నవదీప్ విర్క్ ఖండించారు.
ఆ తరువాత 2015లో భారతిని ఆ పోస్టు నుంచి ట్రాన్స్ ఫర్ చేశారు. అలా ఒకే సంవత్సరంలో ఆమె మూడుసార్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు. 2016లో డీఐజీ (సంక్షేమం, శిక్షణ), తరువత సోనిపట్లోని స్పోర్ట్ కాలేజీ ప్రిన్సిపాల్గా, 2016లో హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గో సంరక్షణ టాస్క్ఫోర్స్ మొదటి నోడల్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఆ తర్వాత గుర్గావ్ ఐజీ (స్టేట్ క్రైమ్బ్రాంచ్)గా బాధ్యతలు స్వీకరించారు.ఈక్రమంలో ఆమె వీఆర్ఎస్ తీసుకోవాలనుకున్నారు. దానికి సంబంధించిన దరఖాస్తును హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వద్దకు చేరింది. అనిల్ విజ్ 2009లో అంబాలా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని భారతి ఆదేశించారు. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ ఫైల్ ఆయన వద్దకే చేరుకోవడం గమనించాల్సిన విషయం. ఎవరినైతే ఆమె అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారో..అదే వ్యక్తి హోమ్ మినిష్టర్ కావటం ఆయన వద్దకే ఆమె వీఆర్ఎస్ అప్లికేషన్ చేరటం విశేషం అనే చెప్పాలి.