Manmohan Singh : నిలకడగా మాజీ ప్రధాని ఆరోగ్యం..త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.

Manmohan Singh కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు. జ్వరం, నీరసం కారణంగా బుధవారం ఢిల్లీ ఎయిమ్స్​లో మన్మోహన్ సింగ్​ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఎయిమ్స్ కి వెళ్లిన కేంద్రఆరోగ్యమంత్రి..డాక్టర్లను అడిగి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక నిపుణుల బృందం మన్మోహన్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి. ఇక,మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. మన్మోహన్ కి మంచి ఆరోగ్యాన్నివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఓ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

కాగా, మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడి ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న విషయం తెలిసిందే. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.

ALSO READ  విశాఖ తీరానికి యూఎస్ఎస్ కార్ల్ విన్సన్

ట్రెండింగ్ వార్తలు