Elephants Drink Country Liquor : వార్నీ.. నాటు సారా తాగి మత్తుగా నిద్రపోయిన ఏనుగులు

ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.

Elephants Drink Country Liquor : వార్నీ.. నాటు సారా తాగి మత్తుగా నిద్రపోయిన ఏనుగులు

Elephants Drink Country Liquor : ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.

ఏనుగులు ఏంటి? నాటుసారా తాగి మత్తులో ఊగడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. మ్యాటర్ ఏంటంటే.. అడవిలో పులియబెట్టిన సారాను ఏనుగుల మంద(24 గజరాజులు) తాగేసింది. ఆ తర్వాత మత్తులో అలాగే నిద్రించాయి. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్తులు.. ఏనుగులు ఆదమరచి నిద్రపోవడం చూసి కంగుతిన్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, ఎంతకీ గజరాజులు లేవలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డప్పులు కొట్టి శబ్ధం చేయడంతో ఏనుగులు లేచాయి. తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.

”మేము సారా సిద్ధం చేయడానికి ఉదయం 6 గంటలకు అడవిలోకి వెళ్ళాము. అక్కడ కుండలన్నీ పగలగొట్టబడి ఉన్నాయి. పులియబెట్టిన నీరు కనిపించలేదు. ఆ పక్కనే 24 ఏనుగులు ఆదమరిచి నిద్రపోతూ కనిపించాయి. అవి పులియబెట్టిన నీటిని తాగేశాయి. ఆ మద్యం ప్రాసెస్ చేయబడలేదు. మేము జంతువులను మేల్కొలపడానికి ప్రయత్నించాము, కానీ విఫలమయ్యాము. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాము” అని ఓ గ్రామస్తుడు తెలిపాడు. ఏనుగుల మందలో 9 ఆరు ఆడ ఏనుగులు, 9 కూన ఏనుగులు ఉన్నాయి.