Himachal Pradesh : గర్భిణీకి కావాల్సింది జైలు కాదు..బెయిల్‌..మాతృత్వం మహిళ హక్కు: హైకోర్టు

‘గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు.. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు.. బెయిల్‌ అని సంచలన వ్యాఖ్యలు చేసింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న గర్భిణికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ అనుప్ చిట్కర.

Himachal Pradesh : గర్భిణీకి కావాల్సింది జైలు కాదు..బెయిల్‌..మాతృత్వం మహిళ హక్కు:  హైకోర్టు

Pregnant Women Need Bail, Not Jail (1)

‘Pregnant Woman Needs Bail Not Jail’ : డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన గర్భిణికి బెయిల్‌ మంజూరు చేసింది ఇచ్చిన హిమాచర్ ప్రదేశ్ హైకోర్టు. ఈ సందర్బంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు.. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు.. బెయిల్‌ అని స్పష్టం చేసింది. నార్మాటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్ యాక్ట్) కింద నమోదైన కేసులో సహ నిందితురాలిగా ఉన్న గర్భిణీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన విషయం.
ఈ కేసులో సదరు గర్భిణికి బెయిల్ ఇస్తున్న క్రమంలో జస్టిస్ అనూప్ చిట్కర మాట్లాడుతు.. నిందితురాలికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి.. శిక్షను ప్రస్తుతం నిలిపివేసి.. డెలివరీ తర్వాత ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చని సూచించారు. సదరు నేరస్థులు చేసిన నేరాలు చాలా ఘోరంగా ఉన్నా..దానికి సంబంధించి ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దీన్ని అనుమతించాలని అన్నారు.

ఇంకా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేస్తూ..‘జైలు శిక్షను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి, సమాజానికి ఏదైనా హానీ జరుగుతుందా? జైలు శిక్ష వాయిదా వేస్తే ఆకాశం ఊడి పడిపోదుకదా..సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం తరువాత సంవత్సరం వరకు ఆమె మీద ఎలాంటి పరిమితులు ఉండకూడని జస్టిస్ చిట్కరా స్పష్టం చేశారు.ఆమెకు బెయిల్ ఇవ్వకుండా జైలులోనే ప్రసవిస్తే అభం శుభం తెలియని ఆ పుట్టబోయే బిడ్డ సమాజం నుంచి నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని..సామాజిక ద్వేషాన్ని చూడాల్సి వస్తుందని..ఆ బిడ్డ పుట్టుకను కూడా సమాజం ప్రశ్నిస్తుందని అన్నారు. జైలులోనే జన్మించాడని తెలిస్తే.. సమాజం ఆ బిడ్డను ఎంత దారుణంగా ఆ బిడ్డ ద్వేషింపబడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజం ఆ బిడ్డను చీదరించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలో ఇటువంటి బిడ్డల పట్ల పోకడలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదన్నారు. ఆ బిడ్డ జైలులో జన్మిస్తే..బిడ్డ భవిష్యత్తుమీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.

కానీ..ఆమెను జైలులో మంచి ఆహారం అందించడం ద్వారా శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చునేమో గానీ..ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. మాతృత్వాన్ని ఆశించే ఆడవారికి గౌరవం దక్కాలని..అటువంటి గౌరవాన్ని న్యాయస్థానం కల్పిస్తోందని అన్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్ 37 లోని ఆదేశం నిందితులు నిర్దోషులుకు క్లీన్‌ చీట్‌ ఇవ్వడానికి.. రెండు షరతులను సంతృప్తి పరచాలని సూచిస్తుంది. దర్యాప్తుదారులు సేకరించిన సాక్ష్యాలు నిందితులకు బెయిల్ నిరాకరించడానికి చట్టబద్ధంగా సరిపోకపోవడమే కాక..వారి మీద మరే ఇతర దోషపూరిత సాక్ష్యాలు, ఆరోపణలు లేనప్పుడు.. నిందితులను నిర్దోషులుగా భావించవచ్చు అన్నారు. దీని ప్రకారంగా చూస్తే పిటిషనర్ మొదటి షరతును సంతృప్తిపరిచారని కనుక సదరు గర్భిణికి అతి తక్కువ సమయంలోనే బెయిల్‌ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. దీని ఆధారంగా కోర్టు సదరు నిందితురాలికి బెయిల్‌ మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు జస్టిస్ చిట్కరా.

కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి : హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 32 ఏళ్ల గర్భిణీని పోలీసులు తన భర్తతో కలిసి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తోదనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ క్రమంలో సదరు నిందితుల ఇంట్లో సోదాలు నిర్వహించీ 259 గ్రాముల హెరాయిన్‌, 713 గ్రాముల ట్రామడోల్‌ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సదరు నిందితురాలు కంగ్రా జిల్లా ప్రత్యేక కోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయగా..కోర్టు 2021 జనవరి 19న దాన్ని కొట్టేవేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ చిట్కరా ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు.