Assam : హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు : అసోం ఎంపీ బద్రుద్దీన్
హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు అంటూ అసోం ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Assam MP Badruddin Ajmal Hindu men marry late : ముస్లిం సామాజిక వర్గంలో పురుషులు 18 నుంచి 21 ఏళ్లకు వివాహాలు చేసుకుంటారని కానీ హిందువులు మాత్రం 40ఏళ్లు వచ్చే వరకు వివాహాలు చేసుకోరని ఎందుకంటే హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం వల్లే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు అంటూ ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం (డిసెంబర్ 2,2022) బుద్రుద్దీన్ అస్మల్ మాట్లాడుతూ..హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని..కానీ ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేసుకుంటారని…అందుకే ముస్లింలకు పిల్లలు ఎక్కువగా ఉంటారని హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని చెప్పారు. వారు ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం వల్లే వారికి పిల్లలు తక్కువగా ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. అంత ఆలస్యంగా వివాహం చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు? అంటూ ప్రశ్నించారు బద్రుద్దీన్ అస్మల్.
హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు. సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలను ఆశించవచ్చని అన్నారు. పెళ్లి విషయంలో ముస్లింలు అనుసరించే విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలంటూ సూచనలు కూడా ఇచ్చారాయన. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే వారికి చక్కటి పిల్లలు పుడతారని ఎక్కవమంది పిల్లలు పుడతారని అన్నారు. బుద్రుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.