‘క్రిష్టమస్ రోజున హిందువులు చర్చిలకు వెళ్తే చితక్కొడతాం’

‘క్రిష్టమస్ రోజున హిందువులు చర్చిలకు వెళ్తే చితక్కొడతాం’

Bajrang Dal leader: క్రిష్టమస్ పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్లాలనుకునే హిందువులకు భజరంగ్ దళ నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. అస్సాంలోని కచర్ జిల్లాలో జరిగిన వేదిక సందర్భంగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో క్రిష్టమస్ పండుగకు చర్చిలకు వెళ్లిన వారిని దారుణంగా కొడతాం అని ఉంది.

డిసెంబర్ 3న సిల్చార్ లో జరిగిన భజరంగ్ దళ ఈవెంట్ జరిగింది. షిల్లాంగ్‌లోని రామకృష్ణ మిషన్ లో భాగమైన వివేకానంద సెంటర్‌ను షట్‌డౌన్ చేసిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికగా మిథు నాథ్ అనే దళ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

‘వారు షిల్లాంగ్ లో టెంపుల్స్‌ను లాక్ చేస్తున్నారు. మనమేమో వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇది జరగకూడదు. దీనిని మేం అనుమతించం. క్రిష్టమస్ సందర్భంగా ఏ హిందువు చర్చికి వెళ్లకూడదు. ఎవరైనా హిందువు చర్చికి వెళితే భజరంగ్ దళ వారికి సరైన సమాధానం చెప్తుంది’ అని మిథునాథ్ వార్నింగ్ ఇస్తున్నారు.

దాంతో పాటు ‘మీడియా మనల్ని గూండా గ్యాంగ్ అని పిలుస్తుంది. ఎవరైనా హిందూ యువతుల్ని టచ్ చేయడం, వేధించడం మొదలుపెడితే అప్పుడు గూండాలైపోతాం. దానికి గర్వపడుతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కన్వీనర్ ఆఫ్ భజరంగ్ దళ్ సోహాన్ సింగ్‌ సోలంకి కూడా పాల్గొన్నారు.