Mangalore : హాస్టల్ గదిలో యువతిపై అత్యాచారం

హాస్టల్ లో ఎవరు లేని సమయంలో లోపలికి ప్రవేశించిన వ్యక్తి 23 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు.

Mangalore : హాస్టల్ గదిలో యువతిపై అత్యాచారం

Mangalore

Mangalore : కర్ణాటకలోని మైసూరు పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని ఓ హాస్టల్ లో ఉంటుంది 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయంలో హాస్టల్ లోకి వచ్చిన సదరు వ్యక్తి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెతో గొడవపడి కత్తితో దాడి చేసి పారిపోయాడు. అదే హాస్టల్ లో ఉండే మరో యువతి గదికి వెళ్లి చూడటంతో రక్తం కారుతూ కనిపించింది బాధితురాలు. వెంటనే ఆమె హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు.

చుట్టూ పక్కల ఉండే సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని కనుగొన్నారు. నిందితుడు స్థానికంగా ఉన్న ఓ మత అధ్యయన కేంద్రంలో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి నిందితుడితో గతంలోనే పరిచయం ఉందని గుర్తించారు. కాగా మొదట గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే పోలీసులు ఆమెను ప్రశ్నించిన తర్వాత నిందితుడు తెలిసిన వ్యక్తిగా తెలిపింది. అయితే యువతే అతడిని హాస్టల్ కి పిలిపించుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతడు ఆమెపై కత్తితో దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి మెరుగైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు.