జైళ్లు కిక్కిరిసిపోతున్నాయ్..నిందితులను జ్యుడీషియల్ కస్టడీగా హౌస్ అరెస్ట్ చేయొచ్చు: సుప్రీంకోర్టు

వివిధ రకాల నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీ పేరిట జైలుకి పంపించకుండా..వారిని హౌస్ అరెస్ట్ చేయమచ్చని సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందులందరిని జైళ్లకు పంపించటం వల్ల జైళ్లన్ని నిండిపోతున్నాయనీ..దీంతో ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని..కాబట్టి నిందుతులను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా వారిని జైళ్లకు తరలించకుండా హౌస్ అరెస్ట్ చేయవచ్చని వ్యాఖ్యానించింది.

జైళ్లు కిక్కిరిసిపోతున్నాయ్..నిందితులను జ్యుడీషియల్ కస్టడీగా హౌస్ అరెస్ట్ చేయొచ్చు: సుప్రీంకోర్టు

Supreme Court key Comments

Supreme Court Key comments : వివిధ రకాల నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీ పేరిట జైలుకి పంపుతారనే విషయం అందరికీ తెలిసిందే. నిందితులతో జైళ్లన్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందులందరిని జైళ్లకు పంపించటం వల్ల జైళ్లన్ని నిండిపోతున్నాయనీ..దీంతో ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని..కాబట్టి నిందుతులను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా వారిని జైళ్లకు తరలించకుండా హౌస్ అరెస్ట్ చేయవచ్చని వ్యాఖ్యానించింది.

పలు విధాల కేసుల్లో నిందుతులతో దేశంలోని జైళ్లు కిక్కిరిసిపోతున్నాయని… జైళ్లను ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్వహిస్తున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతి ఏటా జైళ్ల నిర్వహణ కోసం రూ. 6,818.1 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారనీ..ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని నిందితులను హౌస్ అరెస్ట్ లు చేయాలని సూచిస్తున్నామని జస్టిస్ లలిత్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

అయితే నిందితులను హౌస్ అరెస్ట్ చేయడానికి వారి వయసు, ఆరోగ్యం, వారు చేసిన నేర తీవ్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణల తర్వాత ఏం చేయాలనే విషయాన్ని న్యాయ వ్యవస్థకు వదిలేయాలని తెలిపింది.జైళ్లు కిక్కిరిసి పోతున్నాయని..వీరి మెయింటినెన్స్ కోసం ప్రభుత్వాలకు ఖర్చు భారమవుతోందని..అందుకే ఈ సూచన చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.