Uttar Pradesh : ఆడ పిల్లలకు జన్మనిచ్చిందని..మహిళపై అత్తింటివారు దాడి, చిత్రహింసలు

మహిళను అత్తంటివారు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. అత్తింటివారి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Uttar Pradesh : ఆడ పిల్లలకు జన్మనిచ్చిందని..మహిళపై అత్తింటివారు దాడి, చిత్రహింసలు

Beat

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని దారుణం జరిగింది. ఆడ పిల్లలకు జన్మనిచ్చిన మహిళను భర్త, అత్తమామలు కొట్టి హింసించారు. మహోబా జిల్లాలోని రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన మహిళల ఇటీవల రెండో కాన్పులోనూ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. మగ సంతానం కలుగకపోవడంతో భర్తతోపాటు అత్తింటివారు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. కొన్నిసార్లు తిండి కూడా పెట్టకపోవడంతో ఆమె ఆకలితో పస్తులుండేది. కడుపు నింపుకునేందుకు కూలీ పని చేస్తోంది.

అయినా అత్తింటివారు ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ఆపలేదు. రెండో కాన్పులో ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి చిత్రహింసలు మరింత అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో అత్తింటి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల ఆమెను దారుణంగా కొట్టి, హింసించారు. ఆ మహిళను కింద పడేసి కాళ్లతో తన్నారు. స్థానికులు కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

Mother Children Suicide : అత్తింటివారి వేధింపులు.. ఇద్దరు పిల్లలు సహా తల్లి బావిలో దూకి బలవన్మరం

మహిళను అత్తంటివారు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. అత్తింటివారి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె భర్త, అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.