కరెంట్ ఎఫైర్ : పెళ్లికార్డులో ‘ఐ సపోర్ట్ CAA’
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. వ్యతిరేకించినవాళ్లు ఆందోళనలు కొనసాగిస్తుంటే సమర్థించినవాళ్లు వినూత్న రీతిలో తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో నరసింహపూర్ జిల్లాకు చెందిన ఓ జంట తమ పెళ్లికార్డులో ‘ఐ సపోర్ట్ సీఏఏ’ అని ముద్రించారు.
జనవరి 18న నరసింహపూర్ జిల్లాకు చెందిన ప్రభాత్ వివాహం జరగనుంది. ప్రభాత్ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలుకుతూ..పెళ్లి కార్డులో ప్రింట్ చేయించారు. సందర్భంగా ప్రభాత్ మాట్లాడుతూ తాను పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలనుకుంటున్నానని అందుకే ఇలా వెడ్డింగ్ కార్డులో ప్రింట్ చేయించానని తెలిపారు.
అలాగే యూపీకి చెందిన మోహిత్ మిశ్రా, సోనమ్ పథక్ లు కూడా తన వెళ్లి కార్డులో సీఏఏ,ఎన్ ఆర్ సీకి మద్దతు తెలుపుతున్నట్లుగా తమ పెళ్లికార్డులో ప్రింట్ చేయించుకున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 3న జరగనుంది. CAA అమలు అనంతరం NRC పై దేశవ్యాప్తంగా అనేక నిరసనలు చెలరేగుతున్న క్రమంలో యూపీలో కూడా హింసాత్మక ప్రదర్శనల మధ్య CAA ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కావటం విశేషం.